ఉత్తర్ ప్రదేశ్ లోని రాంపూర్ బీజేపీ అభ్యర్థి గా సినీనటి జయప్రద పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో భాగంగా జయప్రదపై సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి అజంఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో మూడు రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి లేదంటూ ఈసీ ఆయన పై నిషేదం విధించింది. తాజాగా జయప్రద కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆమె పై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ నెల 18న ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జయప్రద బీఎస్పీ అధినేత్రి మాయావతి, రాంపూర్ ఎస్పీ అభ్యర్థి ఆజంఖాన్ లపై ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాయావతిపై ఆజంఖాన్ ఎక్స్ రే కళ్లు వేసి ఎక్కడెక్కడ చూశారంటూ ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఈసీ ఈ జయప్రద వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకుంది. ఈసీ ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
మరోసారి జడేజా పై మంజ్రేకర్ అనుచిత వ్యాఖ్యలు…