telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదనడం అవివేకం…

కాంగ్రెస్ నేత ఏఐసీసీ కార్యదర్శి మధు యాష్కీ మాట్లాడుతూ… కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదనడం కేసీఆర్ అవివేకం.. సోనియాగాంధీ వల్లనే తెలంగాణ ఏర్పడింది అని అన్నారు. స్వార్ధ రాజకీయ లాభం కోసం తెలంగాణ అన్నది కేసీఆర్.. నీ అవినీతి బయట పడే రోజులు దగ్గర పడ్డాయి అని తెలిపారు. యూనివర్సిటీ లో వైస్ చాన్సలర్ లేరు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు సిద్దిపేటలో కట్టి జన్మ ధన్యం అయ్యింది అనుకుంటున్నారు. మిగిలిన 8 లక్షల మందికి ఎప్పుడు ఇస్తారు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అని ప్రశ్నించారు. మోడీ కాళ్ళు పట్టుకోవడానికి కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళాడు. అపోయింట్మెంట్ లేకున్నా… ఢిల్లీకి ఎందుకు వెళ్ళాడో కేసీఆర్ సమాధానం చెప్పాలి. నీ అవినీతి బయట పెట్టి జైల్లో పెడతా అని బీజేపీ నాయకులు చెప్పిన మాటలకు భయం తో ఢిల్లీకి వెళ్ళాడు కేసీఆర్. జైలుకు వెళ్తాననే భయం పట్టుకుంది కేసీఆర్ కు అని పేర్కొన్నారు. బీజేపీ..ఎంఐఎం.. తెరాస ముగ్గురు ప్రజలను మోసం చేస్తున్నారు అని చెప్పిన మధు యాష్కీ తెర ముందు కొట్లాడినట్టు… తెరవెనుక దోస్తానా చేస్తున్నాయి తెరాస.. బీజేపీ లు అన్నారు. మూడు నెలలుగా రిజిస్ట్రేషన్ లు ఎందుకు అపావు అని బీజేపీ అడగదు ఎందుకు.. మోడీ ని ఆహా..ఓహో అని పొగడ్తల్లో ముంచాడు కేసీఆర్. ఆయన సెక్రటేరియట్ కూల్చితే బీజేపీ మద్దతు పలికింది. అలాగే మోడీ కొత్త పార్లమెంట్ కడితే…కేసీఆర్ ఆహా..ఓహో అంటూ భజన చేస్తున్నారు అని పేర్కొన్నారు.

Related posts