telugu navyamedia
రాజకీయ వార్తలు

చిదంబరం కేసులకు ఆధారాలు: నితిన్ గడ్కరీ

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరంకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఘాటుగా స్పందించారు. చిదంబరంపై నమోదు చేసిన కేసులకు ఆధారాలు ఉన్నాయని తెలిపారు. విచారణ జరుగుతోందని, కోర్టులు నిర్ణయం తీసుకుంటాయని చెప్పారు.

చిదంబరం కేంద్ర హోం మంత్రిగా ఉన్నప్పుడు… మోదీ, అమిత్ షాలతో పాటు తనపై తప్పుడు కేసులు పెట్టారని గడ్కరీ మండిపడ్డారు. అయితే, ఆ కేసుల నుంచి తాము నిర్దోషులుగా బయటపడ్డామని ఆయన చెప్పారు. మరోవైపు, బెయిల్ మంజూరు కావడంతో ఈ సాయంత్రంలోగా చిదంబరం జైలు నుంచి విడుదల కానున్నారు.

Related posts