telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

ఏడు కొండలపై కరోనా పంజా.. తిరుమలలో 10 మందికి పాజిటివ్!

tirumala temple

తిరుమలలో శ్రీవారి దర్శనాలు తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో దర్శనానికి వచ్చే భక్తులందరికీ అలిపిరిలోనే థర్మల్ స్క్రీనింగ్ ను చేస్తున్నారు. అయినప్పటికీ గత నెలలో ఆంక్షల నడుమ దర్శనాలను ప్రారంభించిన తరువాత, స్థానిక బాలాజీ నగర్ లోని ఓ వ్యక్తికి వైరస్ సోకిన సంగతి తెలిసిందే. ఆపై మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన టీటీడీ అధికారులు, దశలవారీగా ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు.

ఈ నేపథ్యంలో ఈ వారం ప్రారంభంలో తిరుమలలో విధులు నిర్వహిస్తున్న వారి నమూనాలు సేకరించి, పరీక్షలకు పంపారు.టీటీడీ ఉద్యోగులు, స్వామి కైంకర్యాల్లో పాల్గొనే పూజారులు సహా మొత్తం 10 మందికి పాజిటివ్ వచ్చింది. కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో అధికారులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.

 వెంటనేవారందరినీ ఆసుపత్రులకు తరలించి, వారి కుటుంబీకులకు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. ఏ విధమైన కరోనా లక్షణాలున్నా, కొండపైకి రావద్దని ఆయన  భక్తులకు విజ్ఞప్తి చేశారు.

Related posts