telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

బాసర ట్రిపుల్‌ ఐటీలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానం

basara iiit

నిర్మల్‌ జిల్లా బాసరలోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌ (ఆర్టీయూకేటీ)లో 2020–21 విద్యాసంవత్సరం ప్రవేశాల కోసం నోటిఫికేషన్‌ విడుదలైంది. కళాశాల అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ రాజేశ్వరరావు శనివారం ఈ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.

ఈ నెల 16 నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు.ఆరేళ్ల బీటెక్‌ ఇంటిగ్రేడ్‌టెడ్‌ కోర్సులో చేరేందుకు పదో తరగతి చదవిన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. స్థానికులకు 85 శాతం, స్థానికేతరులకు 15 శాతం సీట్లు కేటాయించినట్లు తెలిపారు.

Related posts