telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

ఏఎంఆర్‌పీ లో లెవల్‌ కెనాల్‌కు .. నీటివిడుదల..

water released to low level canal by

ఏఎంఆర్‌పీ లో లెవల్‌ కెనాల్‌కు మంత్రి జగదీశ్‌రెడ్డి శనివారం నీటిని విడుదల చేశారు. సాగునీటిని పొదుపుగా వాడుకోవాలని మంత్రి ఈ సందర్భంగా రైతాంగానికి పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు నిరందించాలన్నదే సీఎం కేసీఆర్‌ సంకల్పమన్నారు. ఏప్రిల్‌ 4 వరకు నీటి లభ్యతను బట్టి ఆన్‌ అండ్‌ ఆఫ్‌ పద్దతిలో గడువు పొడిగించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే హై లెవల్‌ కెనాల్‌ ద్వారా 2 లక్షల 20 వేల ఎకరాలకు నీరందించినట్లు తెలిపారు. అదేవిధంగా 225 చెరువులు, కుంటలను నింపినట్లు చెప్పారు.

లో లెవల్‌ కెనాల్‌ ద్వారా 50 వేల పైచిలుకు ఎకరాలకు నీరు అందించడంతో పాటు 27 చెరువులను, కుంటలను నింపనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌, ఎమ్మెల్యేలు, భాస్కర్‌రావు, నోముల నర్సింహాయ్య, కంచర్ల భూపాల్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు రామచంద్ర నాయక్‌, ఆప్కాబ్‌ మాజీ చైర్మన్‌ విజయేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు సి.కోటిరెడ్డి, కే.వి. రామారావు తదితరులు పాల్గొన్నారు.

Related posts