telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

బాబు కుట్రలో విశాఖ విచ్ఛిన్నమైంది: విజయసాయిరెడ్డి

vijayasaireddy ycp

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘విశాఖ కంటకుడు చంద్రబాబు’ అంటూ తన సామాజిక మాధ్యమాల ఖాతాల్లో వ్యాసం రాసుకొచ్చారు. ‘బాబు కుట్రలో విశాఖ జిల్లా ఆయన అధికారంలో ఉండగా విచ్ఛిన్నమైంది’ అంటూ ఆరోపణలు గుప్పించారు.

‘ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా విశాఖ జిల్లా అభివృద్ధి కోసమే తపించే నాయకుడు జగన్ గారు. స్టీల్ ప్లాంట్ ను కాపాడటం నుంచి జనం దాహర్తిని తీర్చడం వరకు జిల్లాకు వైఎస్ఆర్ చేసిన సేవలు మరువలేనివి. అధికారంలోనున్నప్పుడు సముద్రాన్ని కంట్రోల్ చేస్తా, ప్రకృతిని శాసిస్తానంటూ సొల్లు కబుర్లు చెబుతూ బాబు కాలక్షేపం చేశారని దుయ్యబట్టారు.

ఇప్పుడు విపక్షంలో చేసేదిలేక అభివృద్ధిని ఎలా అడ్డుకోవాలా అని ప్లాన్స్ వేస్తున్నాడు. కేవలం గ్రాఫిక్స్ తో మాయచేశాడు… పెట్టుబడులు సదస్సులు పెట్టాం, రూ.40 లక్షల కోట్లు వచ్చేస్తాయన్నాడు చంద్రబాబు. తీరాచూస్తే సదస్సు పెట్టడానికైన ఖర్చులో సగంకూడా పెట్టుబడులు రాలేదు’ అని విజయసాయిరెడ్డి విమర్శించారు.

Related posts