పదేళ్ల క్రితం జైపూర్లో జరిగిన పేలుళ్ల ఘటనలో సుమారు 80 మంది మరణించారు, 170 మంది గాయపడ్డారు. 2008లో జరిగిన ఈ ఘటనలో నలుగురు దోషులకు మరణశిక్ష విధిస్తూ రాజస్థాన్ కోర్టు ఈ రోజు తీర్పు వెలువరించింది. ఈ కేసులో మొహ్మద్ సైఫ్, సర్వార్ ఆజ్మీ, సల్మాన్, సైఫుర్ రెహ్మాన్లు నిందితులుగా ఉన్నారు.
ఈ కేసులో షాబాజ్ హుస్సేన్ నిర్దోషిగా బయటపడ్డాడు. కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురు ప్రస్తుతం తీహార్ జైలులోనే శిక్షను అనుభవిస్తున్నారు. మొహ్మద్ అతిన్ అనే వ్యక్తి జైపూర్లో బాంబు పేలుళ్లకు పథకం వేసినట్టు తెలుస్తోంది. అయితే అతన్ని బాట్లా హౌజ్ ఎన్కౌంటర్లో హతమార్చారు.