telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

మూసీ నదికి శాంతి పూజలు..

మూసీ నదికి శాంతి పూజలు చేయడానికి సిద్దమయింది తెలంగాణా ప్రభుత్వం. ఈరోజు మధ్యాహ్నం గంటలకు జిహెచ్ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్ ఆధ్వర్యంలో మూసీ నది మీద ఉన్న పురానాపూల్ కమాన్ వద్ద హైదరాబాద్ కు చెందిన మంత్రులు మూసీ నదికి శాంతిపూజ చేసి, గంగమ్మ తల్లికి పట్టు వస్త్రాలు,పసుపు, కుంకుమ, పూలు తెలంగాణా ప్రభుత్వంసమర్పిoచనున్నట్లు చెబుతున్నారు. నిజానికి 1908 లో మూసి కి వచ్చిన భారీ వరదతో లక్షలాదిమంది నిరాశ్రయులై వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆరోజున కూడా పండితుల సూచనలు మేరకు నాటి నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ కూడా మూసి కి శాంతి పూజలు చేసి పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమ, పూలు సమర్పించారు. ఆ తర్వాత మూసీ నది శాంతించిందని చెబుతున్నారు. ఇప్పుడు కూడా భారీ వర్షాలు, వరదలు వచ్చినందున అదే సంప్రదాయాన్ని  తెలంగాణా ప్రభుత్వం కొనసాగిస్తూ అమ్మవారికి శాంతి పూజ చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

Related posts