ప్రధానిగా నరేంద్ర మోదీ ఈ నెల 30న ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలువురికి మోదీ ఆహ్వానాలు పంపుతున్నారు. అందులో భాగంగా తాజాగా సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ అధ్యక్షుడు కమల్హాసన్కు ఆహ్వానం పంపారు. తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా మోదీ, కమల్ను ఆహ్వానించారు. మే 30న రాత్రి 7 గంటలకు రాష్ట్రపతిభవన్లో మోదీ ప్రమాణం చేయనున్నారు.
నాథూరామ్ గాడ్సే మొట్టమొదటి హిందూ ఉగ్రవాది అని ఎన్నికల వేళ కమల్హాసన్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దానిపై బీజేపీ నేతలు సర్వత్రా విమర్శలు కురిపించారు. ఈ నేపథ్యంలో తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కమల్ను మోదీ ఆహ్వానించడం విశేషం.
రాముడి బాటలోనే ఐదేళ్లు సుపరిపాలన: చంద్రబాబు