telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అధికారికంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ వేడుకలు

AP

ఉమ్మడి రాష్ట్ర విభజన అనంతరం తొలిసారిగా నవంబరు 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలు అధికారికంగా జరగనున్నాయి. ఈ మేరకు సీఎం జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించనుంది. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో అధికారికంగా నిర్వహించడానికి రంగం సిద్ధమైంది.

అత్యంత వైభవంగా నిర్వహించే ఈ వేడుకలకు సీఎం జగన్, గవర్నర్ బీబీ హరిచందన్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. ఆంధ్ర రాష్ట్ర సాంస్కృతి, సంప్రదాయాలు ఉట్టి పడేలా వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వేడుకల మొదటి రోజు హస్తకళలు, చేనేత కళల ప్రదర్శన, రెండో రోజు కూచిపూడి నృత్య ప్రదర్శన, లలిత, జానపద కళల ప్రదర్శనలు, సురభి నాటకాలు ప్రదర్శించబడతాయి.

Related posts