telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

జకార్తా : .. మహిళల సింగిల్స్‌ లో .. సెమీఫైనల్లోకి పివి సింధు ..

pv sindhu to semi finals in indonesia opens

భారత స్టార్‌ షట్లర్‌ పివి సింధు ఇండోనేసియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. నేడు జరిగిన క్వార్టర్‌ఫైనల్‌ పోటీలో ఐదో సీడ్‌ సింధు 21-14, 21-7 తేడాతో నొజోమి ఒకుహారా(జపాన్‌)పై వరుస సెట్లలో ఘన విజయం సాధించింది. తొలి నుంచి సింధు ఒకుహారాపై ఆధిపత్యం ప్రదర్శించింది.

తొలి సెట్‌లో 5-5తో కొంత పోటీనిచ్చినప్పటికీ సుదీర్ఘ ర్యాలీలు, స్మాష్‌ షాట్లతో సింధు రెచ్చిపోవడంతో మొదటి గేమ్‌ను 21-14తో కైవసం చేసుకుంది. అయితే రెండో గేమ్‌లో పూర్తి ఆధిపత్యంతో 21-7తో ఒకహారా పతనాన్ని శాసించి గేమ్‌తో పాటు మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. ఇక సెమీస్‌లో చైనా షట్లర్‌ చెన్‌ యుఫీతో సింధు తలపడనుంది.

Related posts