భారత స్టార్ షట్లర్ పివి సింధు ఇండోనేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. నేడు జరిగిన క్వార్టర్ఫైనల్ పోటీలో ఐదో సీడ్ సింధు 21-14, 21-7 తేడాతో నొజోమి ఒకుహారా(జపాన్)పై వరుస సెట్లలో ఘన విజయం సాధించింది. తొలి నుంచి సింధు ఒకుహారాపై ఆధిపత్యం ప్రదర్శించింది.
తొలి సెట్లో 5-5తో కొంత పోటీనిచ్చినప్పటికీ సుదీర్ఘ ర్యాలీలు, స్మాష్ షాట్లతో సింధు రెచ్చిపోవడంతో మొదటి గేమ్ను 21-14తో కైవసం చేసుకుంది. అయితే రెండో గేమ్లో పూర్తి ఆధిపత్యంతో 21-7తో ఒకహారా పతనాన్ని శాసించి గేమ్తో పాటు మ్యాచ్ను చేజిక్కించుకుంది. ఇక సెమీస్లో చైనా షట్లర్ చెన్ యుఫీతో సింధు తలపడనుంది.