దేశంలో కరోనా వైరస్ మహోగ్రరూపం దాల్చడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో 64,531 మందికి కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అదే సమయంలో 1,092 మంది మృతి చెందారని తెలిపింది.
దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 27,67,274కు చేరింది. మృతుల సంఖ్య మొత్తం 52,889 కి పెరిగింది. ఇక 6,76,514 మందికి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 20,37,871 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. నిన్నటి వరకు మొత్తం 3,17,42,782 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది.