దేశ వ్యాప్తంగా మిలిటరీ కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. అసాంఘిక శక్తులు మిలిటరీ కేంద్రాలను టార్గెట్ చేశారని వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ రోడ్డులను 26న రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు మూసివేస్తున్నట్లు డిఫెన్స్ డీపీఆర్వో తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. ఈ ఆంక్షల కారణంగా ఈనెల 30వ తేదీ రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు మిలిటరీ రోడ్డు సాధారణ పౌరుల వాహనాల రాకపోకలకు అనుమతి ఉండదని వివరించారు.
నాలుగు రోజుల కిందట తిరుమలగిరి మిలిటరీ దవాఖానకు ఓ వ్యక్తి మిలిటరీ దుస్తుల్లో వచ్చి క్యాంటీన్లో భోజనం చేశాడు. అనుమానం వచ్చి అతన్ని మిలిటరీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, అతన్ని సీఆర్పీఎఫ్ ఐడీ కార్డుతో పాటు ఇతర ఐడీ కార్డులు కూడా బయటపడ్డాయి.
నాలుగు నెలల్లోనే అమరావతిని ముంచేశారు: చంద్రబాబు