telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సికింద్రాబాద్ : …. భద్రతా కారణాల దృష్ట్యా .. కంటోన్మెంట్ రోడ్డు మూసివేత..

ap secunderabad cantonment road closed on security issues

దేశ వ్యాప్తంగా మిలిటరీ కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. అసాంఘిక శక్తులు మిలిటరీ కేంద్రాలను టార్గెట్ చేశారని వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ రోడ్డులను 26న రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు మూసివేస్తున్నట్లు డిఫెన్స్ డీపీఆర్‌వో తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. ఈ ఆంక్షల కారణంగా ఈనెల 30వ తేదీ రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు మిలిటరీ రోడ్డు సాధారణ పౌరుల వాహనాల రాకపోకలకు అనుమతి ఉండదని వివరించారు.

నాలుగు రోజుల కిందట తిరుమలగిరి మిలిటరీ దవాఖానకు ఓ వ్యక్తి మిలిటరీ దుస్తుల్లో వచ్చి క్యాంటీన్‌లో భోజనం చేశాడు. అనుమానం వచ్చి అతన్ని మిలిటరీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, అతన్ని సీఆర్‌పీఎఫ్ ఐడీ కార్డుతో పాటు ఇతర ఐడీ కార్డులు కూడా బయటపడ్డాయి.

Related posts