telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన నిమ్మగడ్డ…

Nimmagadda ramesh

ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ . మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు కూడా గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో మార్చి 1న అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది ఎస్‌ఈసీ… గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఈ మేరకు ఆహ్వానం పంపింది.. మార్చి 1న ఉదయం 9.30 గంటలకు ప్రతి పార్టీ నుంచి ఒక్కొక్కరు రావాలని రాష్ట్ర ఎన్నికలు సంఘం ఆ ఆహ్వానాల్లో పేర్కొంది. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు, ప్రవర్తనా నియమావళిని పాటించాలని రాజకీయపక్షాలను కోరేందుకు సిద్ధమవుతోంది ఎన్నికల కమిషన్.. ఈ సమావేశానికి హాజరుకానున్న రాజకీయపక్షాల నుంచి ఎన్నికల నిర్వహణలో సూచనలు, సలహాలు కూడా స్వీకరించనుంది రాష్ట్ర ఎన్నికల సంఘం. కాగా, రాష్ట్రంలో 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 140 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయిస్తూ… రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ.. రీ-నోటిఫికేషన్‌ జారీ చేయగా.. వివిధ కారణాలతో నాలుగు నగరపాలక సంస్థలు, 29 పురపాలికలకు ఎన్నికలు నిర్వహించడంలేదు. ఇక, గతంలో ఎన్నికల ప్రక్రియ ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి తిరిగి ప్రారంభం కానుంది.

Related posts