ఎటుచూసినా కల్తీ ఉత్పత్తులే దర్శనం ఇస్తున్న తరుణంలో మళ్ళీ సేద్యం సేంద్రియం వైపు మళ్లింది. ఇప్పుడిప్పుడే రైతులు ఈ తరహా వ్యవసాయానికి అడుగులు వేస్తున్నారు. కల్తీ ఉత్పత్తులతో రోగాలు కొనితెచ్చుకోవటం కంటే సేంద్రియ ఉత్పత్తులనే వినియోగదారులు కూడా కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీనిని దృష్టులో పెట్టుకొని మరియు ఆర్గానిక్ రంగంలో ఉన్న మహిళా రైతులు, వ్యాపారవేత్తలకు ప్రోత్సాహం అందించేందుకు ఈనెల 6 నుంచి 10 వరకు మహిళా జాతీయస్థాయి సేంద్రియ మేళా జరుగనున్నది.
శిల్పారామంలో కేంద్ర, రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖలు సంయుక్తంగా 7వ సేంద్రియ ఉత్పత్తుల మేళా-2019 నిర్వహిస్తున్నాయి. ప్రదర్శన వివరాలను మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి ఎం జగదీశ్వర్ వివరించారు. 2015 నుంచి ఈ మేళా నిర్వహిస్తుండగా.. దక్షిణ భారతదేశంలో మొదటిసారిగా హైదరాబాద్లో జరుగుతున్నదని నిర్వాహకులు తెలిపారు.