telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పీసీసీ నియామకం : అధిష్టానానికి జగ్గారెడ్డి మరో లేఖ…

jaggareddy in pcc race in telangana

పీసీసీ నియామకంపై మరోసారి సోనియాగాంధీకి సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ రాశారు. పార్టీ ఇంఛార్జీలు.. లాబీయిస్టుల పట్ల జాగ్రత్తగా ఉండాలని జగ్గారెడ్డి సూచించారు. తాను పంపిన లేఖ సోనిమాగాంధీకి అందుతుందో… లేదో అని మీడియాకు కూడా విడుదల చేస్తున్నానని పేర్కొన్నారు. గతంలో సోనియాగాంధీ పీసీసీని ప్రకటిస్తే కలిసి పని చేసే వాళ్ళమని… ఈ వ్యవస్థని బ్రేక్ చేసే సిస్టం కాంగ్రెస్ లో వచ్చిందన్నారు. ఇదంతా సోషల్ మీడియా తో వచ్చిందని…దీనిపై రహస్య నివేదిక తెప్పించాలని సోనియాగాంధీకి విజ్ఞప్తి చేశారు జగ్గారెడ్డి. పార్టీకి లాయల్ గా ఉండే నాయకత్వాన్ని ఎంపిక చేయాలని… పార్టీలో అంశాల వారీగా కమిటీ వేయాలని కోరారు. ఆర్థికంగా బలంగా ఉన్న నాయకులను గుర్తించి ఐదు నియోజకవర్గాల బాధ్యత అప్పగించాలని.. నాగార్జున సాగర్ ఎన్నికల వరకు పీసీసీ నియామకం వాయిదా వేయాలని సోనియాగాంధీకి విజ్ఞప్తి చేశారు. కాగా.. పీసీసీ నియామకంపై ఇప్పటి వరకూ ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించలేదు. 

Related posts