సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ తన అందంతో, అభినయంతో ఇప్పటికీ మంచి అవకాశాలతో దూసుకెళ్తోంది. ఒకప్పుడు దక్షిణాదిన స్టార్ హీరోలందరితోనూ నటించి అగ్ర కథానాయికగా వెలుగొందిన ఈ బ్యూటీ క్యారెక్టర్ రోల్స్కు మారిన తర్వాత కూడా మంచి అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఇటీవల `బాహుబలి`తో ఉత్తరాదిన కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక రమ్యకృష్ణ, క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా సాయితేజ్ హీరోగా దేవాకట్టా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా రిపబ్లిక్. ఐశ్వర్య రాజేష్ కథానియిక. జగపతి బాబు, రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో రమ్యకృష్ణ పాత్రను పరిచయం చేస్తూ ఆమె ఫస్ట్లుక్ ను చిత్రం బృందం రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా హీరో సాయితేజ్ ట్విట్టర్ వేదికంగా స్పందిస్తూ..”లెజెండరీ నటి రమ్యకృష్ణతో కలిసి నటించడం నాకు దక్కిన గౌరవం. విశాఖ వాణీ పాత్రలో రమ్యకృష్ణ నటనను చూపించడానికి ఎంతో ఉత్సాహంతో ఉన్నా” అంటూ ట్వీట్ చేశారు.
previous post