telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

వెయ్యి కోట్లు ఇచ్చినా.. అధిష్ఠానం పీసీసీ చీఫ్ పదవి ఇవ్వదు: జగ్గారెడ్డి

jaggareddy in pcc race in telangana

తెలంగాణ పీసీసీ చీఫ్ గా కొత్త వ్యక్తిని ఎంపిక చేస్తారన్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ వివాదారహిత రికార్డున్న నాయకులే పీసీసీ చీఫ్ గా ఎన్నికవుతారని అన్నారు. కాంగ్రెస్ లో జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబులే వివాదరహితులన్నారు.

వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చుపెడతామన్నప్పటికీ అధిష్ఠానం పీసీసీ చీఫ్ పదవిని ఇవ్వదని చెప్పారు. వ్యక్తిగతంగా ఎవరు ఎదిగినా అది పార్టీకి మేలుచేస్తుందని అభిప్రాయపడ్డారు. 2018లో డబ్బులు తీసుకొని ఓట్లువేశామన్న భావనలో ప్రజలున్నారన్నారని చెప్పారు. 2023లో డబ్బులు ఇవ్వకపోయినా ఓటర్లు కాంగ్రెస్ పార్టీకే ఓట్లు వేస్తారని జోస్యం చెప్పారు.

Related posts