telugu navyamedia
రాజకీయ వార్తలు

పాకిస్థాన్ లో వెలసిన ‘అఖండ భారత్’ ఫ్లెక్సీలు

Akanda bharath

ఆర్టికల్ 370ని రద్దు చేయడంపై పాకిస్థాన్ ప్రభుత్వం మండిపడుతుంది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలు కొందరు భారత్ చర్యలను సమర్థిస్తున్నారు. పాక్ రాజధాని ఇస్లామాబాద్ లో ఇండియాకు అనుకూలంగా ఫ్లెక్సీలు దర్శనమివ్వడం సంచలనం రేకెత్తించింది. ఇస్లామాబాద్ లోని ప్రెస్ క్లబ్, సెక్టార్ ఎఫ్-6, అబ్ పారా చౌక్ ప్రాంతాల్లో భారత్ కు మద్దతుగా ఈ ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి.

‘మహాభారత్ దిశగా ముందడుగు’ అని బ్యానర్లో పేర్కొన్నారు. అంతేకాదు, అఖండ భారత్ లక్ష్యాన్ని ప్రధాని మోదీ పూర్తి చేయాలంటూ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలను బ్యానర్ పై ప్రింట్ చేశారు. ఈ బ్యానర్లను స్థానికులు చాలా సేపు ఆసక్తికరంగా చూశారు. ఆ తర్వాత కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఫ్లెక్సీలను తొలగించారు. ఈ విషయాన్ని పాకిస్థాన్ లోని ప్రముఖ పత్రిక డాన్ ప్రచురించింది.

Related posts