telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

తన చిత్రాన్ని .. తల్లికి అంకితం చేసిన .. వినోద్‌ చోప్రా..

vinod chopra emotional on his movie campaign

బాలీవుడ్ దర్శక..నిర్మాత వినోద్‌ చోప్రా తన తల్లి శాంతి దేవికి షికారా చిత్రాన్ని అంకితం చేస్తున్నానని చెప్పాడు. ఆయన తల్లి శాంతి.. పరిందా చిత్రం కోసం 1989లో కశ్మీర్‌ నుంచి ముంబై వచ్చి 1999లో తిరిగి కశ్మీర్‌ వెళ్లే క్రమంలో మరణించారు. ఈ సినిమా కేవలం చిత్రం మాత్రమే కాదని కశ్మీర్‌లోని తన ఇంటికి తిరిగి వెళ్లకముందే మరణించిన తన తల్లి కోసం రూపొందించానని వినోద్‌ చోప్రా వెల్లడించాడు.

తన కలను సాధ్య పరచడంలో సహకరించిన కాశ్మీరీ పండితులకు చోప్రా కృతజ్ఞతలు చెప్పాడు. కాగా షికారా చిత్రాన్ని తెరకెక్కించడానికి తనకు 11 ఏళ్లు పట్టిందని తెలిపాడు. ఈ మధ్యలో మూడు మున్నా భాయ్‌ సినిమాలు.. రెండు 3 ఇడియట్స్‌ సినిమాలు చేశానన్నారు. ఈ కార్యక్రమంలో షికారా ప్రివ్యూతో పాటు మరో రెండు వీడియోలు కూడా ప్రదర్శించారు.

Related posts