telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

కర్నూలులో కరోనా కన్నెర్ర .. కొత్తగా 904 మందికి పాజిటివ్!

Corona

కర్నూలులో కరోనా వైరస్ కన్నెర్రజేయడంతో రోజురోజుకూ అక్కడ కేసుల సంఖ్య పెరుగుతోంది. తొలుత పట్టణాలకే పరిమితమైన ఈ కరోనా వైరస్ ఇప్పుడు పల్లెలకు కూడా పాకుతోంది. తాజాగా కర్నూలు జిల్లాలో మరో 904 మందికి కరోనా పాజిటివ్ సోకిందని రాష్ట్ర ప్రభుత్వం గురువారం బులెటిన్ లో పేర్కొంది. మరణాలు కూడా జిల్లాలో మరో ఏడుగురు మరణించారు. ఈ పాజిటివ్ కేసులతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 8701కు చేరుకున్నాయి. మరణాల సంఖ్య 142కు చేరుకుంది.

జిల్లాలో వ్యాప్తంగా వివిధ కొవిడ్ ఆస్పత్రుల్లో 3480 మంది చికిత్స పొందుతుంటే, ఇప్పటికే కోలుకుని ఇళ్లకు చేరుకున్న బాధితుల సంఖ్య 5079కు చేరుకున్నాయి.ఇకపోతే కరోనా జిల్లా అంతటా విజృంభిస్తోంది. కొత్త ప్రాంతాలకు కూడా కరోనా వ్యాప్తిస్తుంది. దీంతో అధికారుల్లో కలవరం మొదలైంది. కరోనా నివారణకు అధికారులు ఇప్పటికే పలు ప్రాంతాల్లో సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించారు.

Related posts