ఒకప్పుడు హీరోయిన్గా అలరించిన ఛార్మి కొన్నాళ్ళుగా పూరీ కనెక్ట్స్ నిర్మాణ సంస్థ బాధ్యతలని చూసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నిర్మాణ సంస్థలో మంచి సినిమాలని నిర్మిస్తూ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది. ఇటీవల “ఇస్మార్ట్ శంకర్” అనే చిత్రాన్ని పూరీ టూరింగ్ టాకీస్, పూరీ కనెక్ట్స్ సంయుక్తంగా నిర్మించాయి. పూరీ టూరింగ్ టాకీస్ బాధ్యతలని పూరీనే చూసుకుంటుండగా, పూరీ కనెక్ట్స్కి కో ఫౌండర్గా ఛార్మి ఉన్నారు. “ఇస్మార్ట్ శంకర్” చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఛార్మి, పూరీ ఒకరికొకరు కారులని బహుమతులుగా ఇచ్చుకున్నారు. ఛార్మికి పూరీ బీఎండబ్యూ 7 సిరీస్ను గిఫ్ట్గా ఇవ్వగా.. పూరీ జగన్నాథ్కు రేంజ్ రోవర్ వోగ్ను ఛార్మీ బహుమతిగా ఇచ్చారు. అతి త్వరలో విజయ్ దేవరకొండ హీరోగా పూరీ చిత్రాన్ని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని పూరీ కనెక్ట్స్ బేనర్పై నిర్మిస్తుండడం విశేషం.
The Founders of @puriconnects Bought Two New Cars
Grey Range Rover Vogue – @purijagan
BMW 7series – @Charmmeofficial pic.twitter.com/umNVwG4bMX
— BARaju (@baraju_SuperHit) September 16, 2019