కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ ఈ వైరస్ విలయం కొనసాగుతూనే ఉంది. అటు ఇప్పటికే రాజకీయ నాయకులకు, సినిమా స్టార్లకు, ప్రముఖులకు కరోనా సోకింది. తాజాగా హైదరాబాద్ లోని గుడిమల్కాపూర్ బిజెపి కార్పొరేటర్ దేవర కరుణాకర్ కూతురు శ్రీమతి భవాని మృతి చెందింది. ఐదు రోజుల పాటు వెంటిలేటర్ మీద వున్న భవాని ఈరోజు ఉదయం ప్రాణాలు కోల్పోయారు. కాగా గత నెల 20న భవాని ఓ బాబుకు జన్మనిచ్చింది. అంతలోపే ఆమెను కరోనా కాటు వేసింది. దీంతో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అయితే భవానికి డెలివరీ జరిగిన ఆస్పత్రిలోనే కరోనా సోకినట్లు అనుమానిస్తున్నారు.
previous post