telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

శ్రీవారి భక్తులకు శుభవార్త… హైదరాబాద్‌లోనూ తిరుమల లడ్డులు !

జూబ్లీహిల్స్ లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో రేపటి నుంచి 21 వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ బ్రహ్మోత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి. ఇవాళ అంకురార్పణ జరుగనుండగా… రేపు ధ్వజారోహణం నిర్వహించనున్నారు. 16న గరుడ వాహనం, 19న రథోత్సవం, 20న చక్రస్నానం, 21న పుష్ప యాగం నిర్వహిస్తారు. భక్తుల హుండీ ఆదాయంతో పుష్కరిణి, ఆంజనేయ స్వామి ఆలయం, స్వామి వారికి బంగారు పాదాలు, కళ్యాణ వేదిక నిర్మించనున్నారు. తిరుమలలో ఎలా బ్రహ్మోత్సవం కార్యక్రమం జరుగుతుందో… ఇక్కడ కూడా అలాగే నిర్వహిస్తామని అడ్వైజరీ కమిటీ ప్రెసిడెంట్ గోవింద హరి పేర్కొన్నారు. తిరుమల లడ్డూలు ఇక్కడ ఆలయంలో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని.. 30 నుంచి 40 వేల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని…. అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

Related posts