telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

గోల్డ్‌ స్కామ్‌లో ప్రముఖ జ్యువెలర్స్‌ ఓనర్‌ కూమారుడు అరెస్ట్‌

బంగారం స్మగ్లింగ్ కేసులో ఘనశ్యామ్ జ్యువెలర్స్ యజమాని కుమారుడు ప్రీత్ కుమార్ అగర్వాల్ ను ఈడీ అరెస్ట్ చేసింది. ఎగుమతి చేసే బంగారాన్ని దేశీయంగా అమ్మి సొమ్ము చేసుకున్నట్టు వస్తున్న అభియోగంపై అగర్వాల్‌ను ఈడీ అరెస్ట్‌ చేసింది. కోల్ కతా డీఆర్ఐ కేసు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నది ఈడీ. కోల్ కత్తా విమానాశ్రయంలో 2018 లో బంగారం స్వాధీనం చేసుకున్న డీఆర్ఐ.. సుమారు 250 కిలోల బంగారం అక్రమాలకు పాల్పడినట్లు తేల్చింది ఈడీ. హైదరాబాద్ లో ఐదు ప్రాంతాల్లో సోదాలు చేసిన ఈడీ…పెద్ద ఎత్తున హవాలా లావాదేవీలు జరిగినట్లు సోదాల్లో గుర్తించింది. భారీగా సుంకం ఎరవేసి అక్రమంగా ఆస్తులు కూడబెట్టుకున్నట్టు ఈడీ గుర్తించింది.

Related posts