సీఎం జగన్, వైసీపీ పార్టీపై టీడీపీ నేత లోకేష్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. “నేను 420 జగన్ రెడ్డికి సవాల్ విసిరితే 840 మొరుగుతోంది ఏంటి?ఏ1 కి దమ్మూ,ధైర్యం లేదా?దైవం మీద ప్రమాణం అనగానే తోకముడిచి చర్చ అంటూ పారిపోతున్నారు.ఇక్కడే తేలిపోయింది నాపై వైకాపా చేసే ఆరోపణల్లో బురద రాజకీయం తప్ప నిజం లేదని. మరోసారి సవాల్… నాపై జగన్ రెడ్డి చేస్తున్న,చేయిస్తున్న ఆరోపణలు అవాస్తవం అని సింహాద్రి అప్పన్న పై ప్రమాణం చెయ్యడానికి సిద్ధం. జగన్రెడ్డి సిద్ధమా? ” అంటూ నారా లోకేష్ ఫైర్ అయ్యారు.
ఇక అంతకు ముందు ట్వీట్లో “లారీలు కాదు జగన్ రెడ్డే అడ్డంగా పడుకున్నా చంద్రబాబు గారి రామతీర్థం పర్యటనను అడ్డుకోలేడు.హిందూ ధర్మం పై జరుగుతున్న దాడిని అడ్డుకోలేని సీఎం జగన్ ,విగ్రహాల ధ్వంసాన్ని అడ్డుకోలేని పోలీసులు కలిసి…చంద్రబాబు నాయుడి గారి పర్యటనను అడ్డుకోవడానికి లారీలు అడ్డంగా పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా?ప్రతిపక్ష నేత బయటకి వెళ్లకుండా గేటుకి తాళ్ళు కడతారు.ఇప్పుడు ఏకంగా లారీలు అడ్డంగా పెట్టారు.ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగానికి అడ్డు,అదుపు లేదు.” అంటూ లోకేష్ ఫైర్ అయ్యారు.
previous post