telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

జనసేన పార్టీకి రాజీనామా చేసిన రావెల

ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో  జనసేన పార్టీ ఘోర పరాజయం చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓటమికి గల కారాణాలను విశ్లేషించేందుకు ఆ పార్టీ అధినేత ఈరోజు మంగళగిరి పార్టీ కార్యాలయంలో తూర్పుగోదావరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో నిర్వహించారు. 

ఈ క్రమంలో జనసేన పార్టీకి మరో షాక్  తగిలింది. ఆ పార్టీ నేత రావెల కిషోర్ బాబు రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల పార్టీ రాజీనామా చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు ఓ లేఖ రాశారు. వెంటనే తన రాజీనామాను ఆమోదించాలని కోరారు.  ఇటీవల జరిగిన ఎన్నికల్లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి జనసేన తరపున ఎమ్మెల్యేగా రావెల పోటీ చేసి ఓటమిపాలయ్యారు.

Related posts