telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే కోసం పోలీసు బృందాల గాలింపు

Vikas_dubey up

ఉత్తరప్రదేశ్ లో ఎనిమిది మంది పోలీసులను పొట్టన పెట్టుకున్న గ్యాంగ్ స్టర్ వికాస్ దూబేను పట్టుకోవడానికి పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. ఈ సందర్భంగా కాన్పూర్ ఐజీ మోహిత్ అగర్వాల్ మాట్లాడుతూ దూబేను, అతని అనుచరులను పట్టుకోవడానకి 25 బృందాలను రంగంలోకి దించామని తెలిపారు.

రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు, ఇతర రాష్ట్రాల్లో సైతం రెయిడింగులు జరుగుతున్నాయని చెప్పారు. 500 మొబైల్ ఫోన్లను నిఘా విభాగం స్కాన్ చేస్తోందని తెలిపారు. స్పెషల్ టాస్క్ పోర్స్ ను కూడా రంగంలోకి దించామని చెప్పారు.దూబే ఆచూకీ తెలిపిన వారికి రూ. 50 వేల నజరానా ఇస్తామని మోహిత్ తెలిపారు. ఆచూకీ తెలిపిన వారి వివరాలను రహస్యంగా ఉంచుతామని చెప్పారు. ఎన్ కౌంటర్ లో గాయపడ్డ ఏడుగురు పోలీసులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు.

Related posts