నటి ఐశ్వర్యారాయ్ ఏడాదిన్నర తర్వాత మళ్లీ ఓ సినిమాలో…అదీ కూడా ఓ బయోపిక్లో, అందులోనూ వేశ్య పాత్ర చేయబోతుందట. 19వ దశకంలో బెంగాల్కు చెందిన వేశ్య. రంగస్థల నటిగా మారింది. నాటకాల్లో విభిన్నమైన పాత్రలు పోషించి అనంతరం గాయనిగా మారిన నతి బిందిని దేశి జీవిత కథలో ఐశ్వర్య నటించబోతుందట. ఆమె ప్రముఖ నటుడు, రచయిత గిరీష్ చంద్ర ఘోష్ ఆధ్వర్యంలో శిక్షణ పొందింది. ఆమె జీవితంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొంది. కలకత్తాలోని వివిధ ప్రదేశాల్లో 80 వరకూ విభిన్నమైన పాత్రలను నాటకాల్లో ప్రదర్శించింది. రంగస్థల నటిగా తన 25 ఏళ్ల ప్రాయంలోనే ఆ రంగానికి స్వస్తి పలికింది.
వివాహం తర్వాత గాయనిగా కొత్త అవతారం ఎత్తింది. అందులోనూ రాణించింది. ఈ సినిమాను ప్రదీప్ సర్కార్ తెరకెక్కించనున్నాడు. ముందుగా దేశి పాత్రను దీపికాపదుకొణే తో నటింపజేయాలని అనుకుని ఆమెను సంప్రదించారు. కథ బాగుందని స్క్రిప్ట్ చదవడానికి ఇష్టపడినా తర్వాత ఇంత భారీ పాత్రలు తాను చేయబోనని తేల్చి చెప్పేసింది. రొమాంటిక్ చిత్రాల్లో మాత్రమే ఇక నుంచి చేస్తానని స్పష్టతనిచ్చిందట. తర్వాత ఇదే స్క్రిప్ట్ను ఐశ్వర్యరారుకు వినిపించాలని భావిస్తున్నారు. ఆమె కూడా కథను విని చేసేందుకు ఆసక్తి చూపిస్తే రెండు నెలల్లో పూర్తిస్థాయి స్క్రిప్ట్ను సిద్ధం చేసేందుకు ప్రదీప్ సర్కార్ సిద్ధంగా ఉన్నారు.