ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఆ ప్రాంత ప్రజలు చేస్తున్న పోరాటం నేటితో 200వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ప్రజారాజధాని అమరావతి కోసం జరుగుతున్న పోరాటం నేటితో 200వ రోజుకు చేరుకుందనిఅన్నారు.
అమరావతి పోరాటానికి బీజేపీ పూర్తి స్థాయిలో సంఘీభావం తెలుపుతోందని ఆయన అన్నారు.రాష్ట్ర భవిష్యత్తును ఛిన్నాభిన్నం చేసి ఏపీకి సరైన రాజధాని లేకుండా వైసీపీ ప్రభుత్వం చేసిందని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ నిరంకుశ విధానాలను ఖండిస్తున్నామని కన్నా పేర్కొన్నారు.