కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న భారత మాజీ క్రికెటర్ మాధవ్ ఆప్టే(86) కన్నుమూశారు. మాధవ్ ముంబయిలోని బ్రీచ్ కాండే హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. 1950వ దశకంలో భారత క్రికెట్జట్టు టెస్టు ఓపెనర్గా సేవలందించిన మాధవ్ ఏడు టెస్టులు ఆడారు. ఇందులో వెస్టిండీస్పైనే ఐదు టెస్టులు ఆడటం విశేషం. వెస్టిండీస్ దిగ్గజ బౌలర్లు ఫ్రాంక్ కింగ్, జెర్రీ గోమెజ్, ఫ్రాంక్ వారెల్ వంటి పేస్ బౌలర్లను ఎదుర్కొని రెండు సెంచరీలు చేశారు.
టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు 163 పరుగులు కాగా.. ఓవరాల్గా 67 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడి 3,336 పరుగులు కూడా చేశారు. క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా అధ్యక్షునిగా పనిచేయడంతోపాటు క్లబ్ ఆఫ్ ఇండియా తరుఫున 15 ఏళ్ల వయసులో సచిన్ టెండూల్కర్కు క్రికెట్ ఆడేందుకు మెంబర్షిప్ ఇవ్వడం విశేషం.
ఆ విషయం పవన్ కల్యాణ్ కు ఎప్పుడో చెప్పాను: జయప్రకాష్