telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

ఢిల్లీ అల్లర్లలో 34కు చేరిన మృతుల సంఖ్య!

Delhi

ఈశాన్య ఢిల్లీలో గ‌త మూడు రోజుల క్రితం సీఏఏ అనుకూల‌, వ్య‌తిరేక వ‌ర్గాల మ‌ధ్య అల్లర్లు జరిగిన సంగతి తెలిసిందే. ఈ అల్లర్లలో మృతిచెందిన వారి సంఖ్య 34కు చేరుకున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రో 200 మంది గాయ‌ప‌డ్డారు. ఆదివారం సాయంత్రం అల్ల‌ర్లు ప్రారంభం అయ్యాయి.

తీవ్ర ఆగ్ర‌హావేశాల‌కు లోనైన రెండు వ‌ర్గాలు.. స్థానికంగా ఉన్న షాపులు, ఇండ్లు, వాహ‌నాల‌కు నిప్పుపెట్టారు. ఒక‌రిపై ఒక‌రు రాళ్లు రువ్వుకున్నారు. జ‌ఫ్రాబాద్‌, మౌజ్‌పుర్‌, బాబ‌ర్‌పుర్‌, య‌మునా విహార్‌ ప్రాంతాల్లో హింస హెచ్చు స్థాయిలో జ‌రిగింది. జీటీబీ హాస్ప‌ట‌ల్‌లో ఇవాళ అయిదుగురు చనిపోయారు, దాంతో మృతుల సంఖ్య పెరిగిన‌ట్లు ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు.

Related posts