ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జనసేన పార్టీ పై మాజీ ఐఏఎస్ అధికారి, లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి రాష్ట్రంలో త్రిముఖ పోటీ ఏర్పడింది. ప్రధాన పార్టీలైన టీడీపీ, వైఎస్సార్సీపీలతో పాటు జనసేన కూడా బరిలో ఉంది. ఈ క్రమంలో ఎంతో బలంగా ఉన్న టీడీపీ, వైఎస్సార్సీపీ గెలుపు కోసం పోటీ పడుతున్నారు. ఈ తరుణంలో జనసేన ఓట్లను చీల్చి ఏ విధంగా నిలబడగలుగుతుందని? జయప్రకాష్ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
తాను ఇదే విషయాన్ని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు కూడా వివరించి చెప్పానని తెలిపారు. .రాష్ట్రంలో పవన్ ప్రభావం గణనీయస్థాయిలో ఉండకపోవచ్చని అంటున్నారు. మూడో పార్టీగా ఉన్న జనసేనకు కష్టకాలం తప్పదని గతంలోనే హెచ్చరించానని తెలిపారు. ఎన్ని ఓట్లు వస్తాయన్నది ప్రజలే నిర్ణయిస్తారని లోక్ సత్తా అధినేత అంటున్నారు.