telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

పట్టాలు తప్పినా.. తప్పించుకున్న ప్రయాణికులు..

train derailed in mumbai all are safe

మరోరైలు పట్టాలు తప్పిన ఘటన, తృటిలో తప్పించుకున్న ప్రయాణికులు.. ముంబై-గోరఖ్ పైర్ మధ్యనడిచే అంతోద్య ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. చూట్టు కొండలు ఉన్న ఈ రూట్ లో వెళ్తున్న అంతోధ్య ఎక్స్ ప్రెస్ గురువారం ఉదయం మహారాష్ట్రలోని కాసర-ఇగత్ పురి స్టేషన్ ల మధ్య పట్టాల పట్టాలు తప్పింది. రైలులోని రెండవ కోచ్ ట్రాలీ పట్టాలు తప్పింది. దీంతో ఆ రూట్లో పలు రైళ్ల రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ఈ ఘటనలో అందరూ సేఫ్ గానే ఉన్నారని, ఎవ్వరికీ ఎలాంటి గాయాలు కాలేదని సెంట్రల్ రైల్వే ఉన్నతాధికారి తెలిపారు. రైలు…ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్ నుంచి ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ కి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు ఆయన తెలిపారు.

Related posts