సుమారు వంద కోట్ల ఎంపీ ల్యాడ్స్ నిధులను కేంద్రానికి ఇస్తున్నట్లు టీఆర్ఎస్ ఎంపీ కే కేశవ రావువెల్లడించారు. ఈ రోజు ఆయన రాజ్యసభలో మాట్లాడుతూ ఎంపీలు, మంత్రుల జీతాల కోత బిల్లుపై ఆయన తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎంపీలు తమ నిధులను ఒక ఏడాది పాటు స్వయంగా ఇచ్చేందుకు అంగీకరించామని గుర్తు చేశారు. సదరు కేంద్ర మంత్రికి కూడా ఈ విషయం తెలుసు అని ఆయన స్పష్టం చేశారు.
తమ రాష్ట్రానికి చెందిన ఎంపీలు ఇచ్చిన నిధులను కేవలం కోవిడ్ పునరావాస కార్యక్రమాలకు మాత్రమే వినియోగించాలని ఆయన అన్నారు. ఎంపీ నిధులపై కేంద్రం విధించిన షరతును వ్యతిరేకిస్తున్నప్పటికీ తాము ఇచ్చిన నిధులు మాత్రం కోవిడ్ రిహాబిలిటేషన్కే వినియోగించాలని చెప్పారు.