telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ఐసోలేషన్‌లో భారత ఆటగాళ్లు…

టీమ్‌ను వదిలి బయటకు వెళ్లిన క్రికెటర్లకు ఓ రకంగా షాక్ ఇచ్చింది బీసీసీఐ.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఐదుగురు ఇండియ‌న్ క్రికెట‌ర్ల‌ను ఐసోలేష‌న్‌లో ఉంచనున్నట్టు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది.. రోహిత్‌శ‌ర్మ‌, శుభ‌మ‌న్ గిల్‌, పృథ్వి షా, న‌వ్‌దీప్‌సైనీ, రిష‌బ్ పంత్‌ల‌ను ఐసోలేషన్‌లో ఉంచాలని నిర్ణయించాయి బీసీసీఐ, క్రికెట్ ఆస్ట్రేలియా… మిగ‌తా టీమ్‌తో కలవకుండా విడిగా ఉండాలని సూచించింది. కాగా, ఆ ఐదుగురు క్రికెటర్లు న్యూ ఇయ‌ర్ 2021 సంద‌ర్భంగా.. టీమిండియా బస చేసిన హోటల్‌ను వదిలి బ‌య‌టి రెస్టారెంట్‌కు వెళ్లి భోజ‌నం చేశారు. సదరు క్రికెటర్లు రెస్టారెంట్‌లో భోజ‌నం చేస్తున్న వీడియోతోపాటు వాళ్ల బిల్లు కూడా నేను పే చేశానంటూ ఓ అభిమాని ట్వీట్ చేయ‌డంతో… ఇటు బీసీసీఐ, అటు క్రికెట్ ఆస్ట్రేలియా అప్రమత్తం అయ్యాయి.. ఓవైపు కరోనా.. మరోవైపు కరోనా కొత్త స్ట్రెయిన్ నేపథ్యంలో.. ఐసోలేషన్‌లో ఉంచాలని నిర్ణయించాయి.. అయితే, , ప్ర‌స్తుతం టీమిండియా, ఆస్ట్రేలియా టీమ్.. మెల్‌బోర్న్‌లో ఉండగా.. ఈ నెల 7వ తేదీన సిడ్నీ వేదికగా జరగనున్న మూడో టెస్ట్ కోసం 4న బయల్దేరివెళ్లనున్నారు.

Related posts