telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కోడ్ ఉల్లంఘించిన వారి పై కేసులు నమోదు చేయాలి: మర్రి శశిధర్‌రెడ్డి

Congress Marri Shashidar reddy L&T

హుజూర్‌నగర్‌ ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ కోడ్ ఉల్లంఘనలపై కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డి బుధవారం ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గురువారం హుజూర్‌నగర్‌లో జరగనున్న సీఎం కేసీఆర్ సభ కోసం టీఆర్‌ఎస్‌ భారీగా ఖర్చు చేస్తోందన్నారు.

హుజూర్‌నగర్‌లో మంత్రుల ఆత్మీయ సమ్మేళనాలు కోడ్ ఉల్లంఘనేనని..కోడ్ ఉల్లంఘించిన మంత్రులపై కేసులు నమోదు చేయాలని ఈసీని కోరినట్లు చెప్పారు. కేసీఆర్‌ కుటుంబానికి చెందిన మీడియాలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ప్రకటనలు వస్తున్నాయని, ఈ ఖర్చును టీఆర్ఎస్ అభ్యర్థి ఖర్చుగానే చూడాలని ఈసీని కోరినట్లు చెప్పారు. కేసీఆర్‌ ఒళ్లు దగ్గర పెట్టుకొని పనిచేయాలంటే హుజూర్‌నగర్‌ ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలని ఆయన ప్రజలకు పిలుపు ఇచ్చారు.

Related posts