తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు విడుతలుగా జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. కౌంటింగ్లో భాగంగ కొన్ని చోట్ల అపశ్రుతులు దొర్లుతున్నాయి. భూపాలపల్లిలో ఎంపీటీసీ బ్యాలెట్ పత్రాలు చెదలు పట్టి పూర్తిగా దెబ్బతినడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.
నిజామాబాద్ కౌంటింగ్ కేంద్రంలో కనీస వసతులు కరువై ఉద్యోగులు మూర్చబోయారు. హృదయ పాఠశాల కౌంటింగ్ కేంద్రంలో కనీస వసతులు కరువయ్యాయి. తాగునీరు లేక సిబ్బంది అవస్థలు పడుతున్నారు. ముగ్గురు ఉద్యోగులు మూర్చబోయారు. దీంతో కౌంటింగ్ ఏజెంట్లు, అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.