telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

జైలులో జేసీ ప్రభాకర్ రెడ్డికి కరోనా

JC Prabhakar Reddy Corona

కడప సెంట్రల్ జైలులో కరోనా కలకం రేపింది. సిబ్బందితో సహా చాలా మంది ఖైదీలు వైరస్ బారినపడ్డారు. మొత్తం 700 మంది నమూనాలను పరీక్షించగా 303 మంది ఖైదీలు, 14 మంది సిబ్బందికి వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. ఇటీవల ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా జైలులో కోవిడ్ సోకింది.

వైరస్ పాజిటివ్ వచ్చిన వారందరినీ వెంటనే ఐసోలేషన్ కేంద్రానికి తరలించామని జైలు సూపరింటెండెంట్ నాయక్ వెల్లడించారు. జేసీ ప్రభాకర్ రెడ్డికి కరోనా సోకిందని తెలియడంతో తాడిపత్రి, అనంతపురం ప్రాంతంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Related posts