telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వైసీపీ వచ్చాక హిందూ మతంపై దాడులు: కన్నా

Kanna laxminarayana BJP

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ మతంపై విచ్చలవిడిగా దాడులు జరుగుతున్నాయని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. అంతర్వేదిలో స్వామివారి రథం అగ్నికి ఆహుతి కావడంఘటనపై ఆయన ఘాటుగా స్పందించారు.

అంతర్వేది ఘటన మతిస్థిమితం లేని వ్యక్తి చేసిన పని అని చెప్పడం దారుణమని అన్నారు.మతిస్థిమితం లేని వ్యక్తి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన ఘటన ఎక్కడా లేదని అన్నారు. అసలైన దోషులను పట్టుకోకుండా ఉద్యోగులకు సస్పెండ్ చేస్తున్నారని కన్నా మండిపడ్డారు.

అసలు దోషులను పక్కన పెట్టేందుకే ఇలాంటి పనులు చేస్తున్నారని అన్నారు. నిరసన వ్యక్తం చేస్తున్న బీజేపీ నేతలను అరెస్ట్ చేస్తున్నారని విమర్శించారు. గత ప్రభుత్వం హయాంలో కూలగొట్టిన దేవాలయాలను ప్రస్తుత ప్రభుత్వం నిర్మించాలని డిమాండ్ చేశారు.

Related posts