telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

పరిస్థితి కొలిక్కి వచ్చేంత వరకు.. విమాన సర్వీసులపై ఆంక్షలు

Air India flight

లాక్‌డౌన్ గడువు ముగిసిన తర్వాత విమాన సర్వీసులు పున:ప్రారంభించేందుకు ఆయా విమానయాన సంస్థలు సిద్దమవుతున్నాయి. ఈ నెల 15 నుంచి టికెట్ల బుకింగ్ ప్రారంభం అవుతుందని పలు సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. అయితే, ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా విమాన ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగుతాయని పౌర విమానయానశాఖ మంత్రి హర్దీప్‌సింగ్ పూరి స్పష్టం చేశారు.

పరిస్థితి అదుపులోకి వచ్చేంత వరకు దేశవాళీ, అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఆంక్షలు ఉంటాయని తెలిపారు. కేంద్రం తాజా ప్రకటనపై స్పందించిన ఇండిగో సంస్థ ఈ నెలాఖరు వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. లాక్‌డౌన్‌కు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి మంత్రి పూరి ధన్యవాదాలు తెలిపారు. లాక్‌డౌన్ గడువు ఈ నెల 14తో ముగియనున్నప్పటికీ కరోనా వైరస్ ప్రభావం రీత్యా దానిని మరింత కాలం పొడిగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Related posts