నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్, కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి, బీజేపీ అభ్యర్థి రవికుమార్ నాయక్ మధ్యే పోటీ. ఇక, అన్ని పార్టీలు సాగర్లో జెండా ఎగరవేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. అయితే ఇవాళ ఎన్నికల ప్రచారం విచిత్రమైన పరిస్థితి నెలకొంది.. ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థి పానుగోతు రవికుమార్ నాయక్.. త్రిపురారం మండలంలోని పలుగ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆయన చేసిన కామెంట్లు ఆసక్తికరంగా మారియి.. ఎన్నికల్లో పోటీచేస్తున్నా.. కానీ, ధైర్యం సరిపోవడం లేదన్న ఆయన.. తనకు ఓటు వేయండి అంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు. కాగా, ఇతర పార్టీల నేతలు.. బీజేపీలో చేరతారు.. వారికే టికెట్ ఇవ్వొచ్చని.. బీజేపీ రాష్ట్రనాయకత్వం చివరి వరకు వేచిచూసినా.. ప్లాన్ ఫెయిల్ కావడంతో.. చివరి నిమిషంలో రవి కుమార్ నాయక్ను బరిలోకి దించింది. అయితే ప్రభుత్వ పథకాలే తమను గెలిపిస్తాయని టీఆర్ఎస్ అభ్యర్థి ధీమా వ్యక్తం చేస్తుండగా.. ప్రభుత్వ వ్యతిరేకతే తమకు ప్లస్ అంటోంది కాంగ్రెస్ పార్టీ. మరోవైపు.. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే నాగార్జునసాగర్లో రిపీట్ అవుతాయని చెబుతున్నారు బీజేపీ నేతలు.
previous post
సోము వీర్రాజు కామెంట్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదు…