telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

సోము వీర్రాజు కామెంట్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదు…

వైసీపీ మంత్రి పినిపె విశ్వరూప్ ఏపీ బీజేపీ అధ్యక్షుడు అయిన సోము వీర్రాజు వ్యాఖ్యల పై స్పందించాడు. బీసీలను సీఎం చేస్తామని బీజేపీ చెప్పడం సంతోషం. కానీ రాజకీయంగా ఏపీలో బీజేపీ స్థాయేంటీ.. బలమేంటీ అని మంత్రి పినిపె విశ్వరూప్ అడిగారు. రాజకీయంగా బీజేపీకి ఏపీలో అవకాశం లేదు కాబట్టి.. బీసీలను సీఎం చేస్తామని చెప్పారు. ఎస్సీలను సీఎం చేస్తామన్న రాష్ట్రాల్లో ఏమయ్యాయో చూశాం. అధికారం వచ్చేంత వరకు ఎస్సీ, బీసీలను ముందు పెడతారు.. అధికారం వచ్చాక దాన్ని మరుస్తారు. కాబట్టి సోము వీర్రాజు కామెంట్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్నారు. బీజేపీకి రాష్ట్రంలో ఓ స్థానం కూడా లేదు.. జనసేనకు ఒకే స్థానం ఉంది. 175 సీట్లున్న ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని.. బీసీని సీఎం చేస్తామని వారు చెప్పడం రాజకీయ ప్రేరేపిత చర్య మాత్రమే. బీసీని సీఎం అంటూ సోము చేసిన వ్యాఖ్య కల మాత్రమే. తనతో ఎవరు టచ్లో ఉన్నారో సోము వీర్రాజు పేర్లు వెల్లడించాలి. పోలవరం జాతీయ ప్రాజెక్టైనా.. నిర్మాణానికి కేంద్రమే నిధులిస్తున్నా.. పోలవరం ఘనత తమదేనని క్లైమ్ చేసుకునే హక్కు బీజేపీకి లేదు. ఎందుకంటే పోలవరం కలను సాకారం చేసింది వైఎస్ మాత్రమే అని విశ్వరూప్ తెలిపారు. చూడాలి మరి దీని పై బీజేపీ ఎలా స్పందిస్తుంది అనేది.

Related posts