ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి తో పాటు ఆయన సోదరుడు, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ముఖ్య అనుచరుడు క్లాస్-1 కాంట్రాక్టర్ చవ్వ గోపాల్రెడ్డి ఇళ్లలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు సోదాలు చేపట్టింది..
శుక్రవారం తెల్లవారుజామున తనిఖీలు ప్రారంభించిన ఈడీ అధికారులు జేసీ ప్రభాకర్ రెడ్డిసహా కుటుంబ సభ్యుల సెల్ఫోన్లతో పాటు కొన్ని డాక్యుమెంట్స్ను స్వాధీనం చేసుకున్నారు. బయట వ్యక్తులు ఎవరూ ఇంట్లోకి రాకుండా ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఈ సమయంలో జేసీ సోదరులు ఇంట్లోనే ఉన్నారు
గతంలో అశోక్ లేల్యాండ్ నుంచి కొనుగోలు చేసిన వాహనాల విషయంలో జరిగిన లావాదేవీలపై ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. సుమారు 20 మందికిపైగా అధికారులు సోదాలు చేస్తున్నారు. అనంతపురం, తాడిపత్రి, హైద్రాబాద్ లలో సోదాలు చేస్తున్నారు.
ఈడీ తనిఖీల నేపథ్యంలో వీరి నివాసాలను సమీపంలో పోలీస్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
మిషన్ బిల్డ్ పేరిట రాష్ట్రాన్ని అమ్మకానికి పెడుతున్నారు: అనురాధ