telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వైసీపీ నేతలపై ఎందుకు కేసులు పెట్టట్లేదు: సోమిరెడ్డి

somireddy chandramohan

లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి కార్యక్రమాలు నిర్వహిస్తోన్న వైసీపీ నేతలపై ఎందుకు కేసులు పెట్టట్లేదని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి ప్రశ్నించారు. ఈ రోజు ఆయన తను మాట్లాడిన ఓ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘిస్తూ వైసీపీ నేతలు పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పటికీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని నీలదేశారు.

వైసీపీ నేతలు వేల మందితో పలు కార్యక్రమాలు చేస్తున్నారు. అడ్డొస్తే ఎస్పీని, కలెక్టర్‌ను ఆ పార్టీ నేతలు నోటికొచ్చినట్లు తిడుతున్నారు. అయినప్పటికీ పోలీసులు చూస్తూ ఉండిపోతున్నారు.మీ ఎమ్మెల్యేలను ఎందుకు నియంత్రణలో పెట్టుకోలేకపోతున్నారని జగన్ ను ప్రాశ్నించారు. మర్కజ్‌ సభ చీఫ్‌పై కేసులు పెట్టారు. ఆ సభ జరిగినప్పుడు ఇంకా లాక్‌డౌన్‌ కూడా ప్రారంభం కాలేదు అయినప్పటికీ కేసులు పెట్టారు కదా? మరి ఎమ్మెల్యేలను ఎందుకు అరెస్టు చేయట్లేదని దుయ్యబట్టారు.

Related posts