telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మిషన్ బిల్డ్ పేరిట రాష్ట్రాన్ని అమ్మకానికి పెడుతున్నారు: అనురాధ

Panchumarthi-Anuradha

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ మహిళా నేత పంచుమర్తి అనురాధ విమర్శలు గుప్పించారు. మిషన్ బిల్డ్ పేరిట రాష్ట్రాన్ని అమ్మకానికి పెడుతున్నారని ఆరోపించారు. సంపద సృష్టించడం చేతకకాపోతే చంద్రబాబు వద్ద క్లాసులు తీసుకోవాలని హితవు పలికారు. రాజధాని కోసం రూ.2 లక్షల కోట్ల సంపదను చంద్రబాబు సమకూర్చితే దాన్ని వల్లకాడులా మార్చేశారంటూ విమర్శించారు.

ప్రస్తుత పరిస్థితుల్లో సంపదను సృష్టించడం ఎంత కష్టమో సీఎం జగన్ గ్రహించాలని తెలిపారు. విజయవాడలో ప్రభుత్వ ఆస్తులు అమ్మేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని దుయ్యబట్టారు. అదే జరిగితే టీడీపీ చూస్తూ ఊరుకోబోదని హెచ్చరించారు. ప్రభుత్వం తక్షణమే ఆస్తులు అమ్మే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అనురాధ స్పష్టం చేశారు.

Related posts