telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

చంద్రబాబును తిడితే రిజర్వాయర్లలోకి నీళ్లు వెళ్లవు: వైసీపీపై దేవినేని ఫైర్

devineni on power supply

చంద్రబాబును తిడితే రిజర్వాయర్లలోకి నీళ్లు వెళ్లవని టీడీపీ నేత దేవినేని ఉమ అన్నారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మీ పరిపాలనా వైఫల్యాన్ని మాకు అంటగడతారా? అంటూ ఏపీ సీఎం జగన్ పై మండిపడ్డారు.తమ హయాంలో వరదలు తక్కువగా వచ్చినా రిజర్వాయర్లలోకి నీళ్లు నింపామని అన్నారు. దీనికి సంబంధించిన లెక్కలన్నీ ప్రభుత్వం దగ్గర ఉన్నాయని చెప్పారు.

గండికోట, బ్రహ్మసాగర్ కు నీళ్లు తీసుకెళ్లామని, అవుకు టన్నెల్ లెక్కలు జగన్ కు, తనకు బాగా తెలుసని అన్నారు. నాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో టెండర్లు పిలిస్తే.. మైనస్ 23 శాతం తక్కువకు టెండర్లు వేసినా ఆ కాంట్రాక్టర్ల మెడలు వంచి కమీషన్లు వసూలు చేశారని ఆరోపించారు.

రాజశేఖర్ రెడ్డి గారి టైమ్ లో అవుకు టన్నెల్ పనులు ఎందుకు ఆగిపోయాయి? ఎందుకు బిల్లులు మీరు కట్టలేదు? రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా మీరేగా ఆరోజు పెత్తనాలు చేసింది. కమీషన్లు దండుకోవడానికి అవుకు టన్నెల్ పనులు పండబెట్టారు’ అని ఆరోపించారు. రాజశేఖర్ రెడ్డి తర్వాత వచ్చిన సీఎంలు కూడా అవుకు టన్నెల్ పనులు చేయడానికి సాహసం చేయలేదని అన్నారు.

Related posts