విత్తనాలు, ఎరువులు, ఫెస్టిసైడ్స్ విక్రయించే సంస్థలు ప్రభుత్వ నియమావళికి లోబడి విక్రయాలు జరపాలని ఏపీ మంత్రి కన్నబాబు ఆదేశించారు. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకంలో భాగంగా గుంటూరు, లాం ఫాం లోని వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో విత్తన ధ్రువీకరణ సంస్థ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విత్తనాలు, ఎరువుల సంస్థలు సర్కారుతో ఒప్పందం చేసుకోవాలని తెలిపారు. నాణ్యమైన విత్తనాల పంపిణీకి విత్తన ధ్రువీకరణ సంస్థ ఉపయోగపడుతుందన్నారు. నియోజకవర్గాల స్థాయిలోనూ ల్యాబ్ ల ఏర్పాటుకు బడ్జెట్ కేటాయింపులు ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, ఉండవల్లి శ్రీదేవి పాల్గొన్నారు.