సార్వత్రిక విద్యాలయంలో భాగంగా ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్ 2019-20 సంవత్సరానికి గాను ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకఇస్తున్నామని ఓపెన్ స్కూల్ చిత్తూర్ జిల్లా కోఆర్డినేటర్ కె.జనార్దనరావు వెల్లడించారు. ఆగస్టు 31వరకు ఎటు వంటి అపరాధ రుసుము లేకుండా ఆయా మండలాల్లో ఎంపికచేసిన ఓపెన్ స్కూల్ కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించామన్నారు. రిజిస్ట్రేషన్ రుసుమును రూ.100 గాను అడ్మిషన్ రుసుమును ఓసీ పురుషులకు రూ.1300, ఓసీ మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులకు రూ.900 చొప్పున అందజేయాలన్నారు.
అలాగే ఓపెన్ ఇంటర్లో రిజిస్ట్రేషన్ రుసుము రూ.200గాను అడ్మిషన్ రుసుము ఓసీ పురుషులకు రూ.1400, ఓసీ మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులకు రూ.1100 చొప్పున చెల్లించాలని జిల్లా కోఆర్డినేటర్ చెప్పారు. మరిన్ని వివరాలకు జిల్లాలోని ఆయా ఓపెన్స్కూల్ కేంద్రాలు నిర్వహిస్తున్న కన్వీనర్లను సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు.
రథం దగ్ధంపై చంద్రబాబు కమిటి..విజయసాయి విమర్శలు